హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎయిరిండియా హైదరాబాద్ నుంచి లండన్ను నాన్ స్టాప్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఎయిరిండియా 147 విమానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రారంభమైన నేపథ్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిరిండియా, జీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి లండన్కు నాన్స్టాప్ విమాన సర్వీసులు నడవనున్నాయి. AI 147 విమానం హైదరాబాద్లో సోమవారం రాత్రి 1:30 గంటలకు బయల్దేరి, లండన్కు అదే రోజు ఉదయం 7:30 గంటలకు చేరుకోనుంది. AI 147 విమానం శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బయల్దేరి, అదే రోజు ఉదయం 11:30 గంటలకు లండన్కు చేరుకోనుంది. లండన్ నుంచి AI 148 విమానం ప్రతి ఆది, గురువారాల్లో హైదరాబాద్కు బయల్దేరనుంది.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్కు ఎయిరిండియా విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది. తదితర వివరాలకు www.airindia.in వెబ్సైట్ను సందర్శించొచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1860 233 1407 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.