పూర్తైన ఫిరోజ్గూడ ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు
రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మాణం
వచ్చేవారంలో ప్రారంభానికి సన్నాహాలు
బాలానగర్, ఏప్రిల్ 18 : ప్రయాణికుల సౌకర్యార్థం ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫిరోజ్గూడలో నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఫిరోజ్గూడ ప్రాంతలో వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా ఇక్కడ కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫిరోజ్గూడలో చేపట్టిన పాదచారుల వంతెన పనులు పూర్తయ్యాయి. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించేందుకు ఎమ్మెల్యే కృష్ణారావు, జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రోడ్డు దాటే ఇబ్బందులు పూర్తిగా తోలగిపోనున్నాయి.
రూ. 2.5 కోట్ల నిధులతో ఫుట్ ఓవర్
గౌతంనగర్, ఫిరోజ్గూడలో రూ. 2.5 కోట్ల నిధులతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జికి మెట్లతో పాటు లిఫ్ట్ సదుపాయం ఏర్పాటు చేశారు.
త్వరలోనే ప్రారంభం..
గౌతంనగర్, ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఏప్రిల్ మూడోవారంలో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి సమయం కేటాయించగానే వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– గోవర్ధన్గౌడ్, ఈఈ కూకట్పల్లి సర్కిల్