సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య వ్యాపారస్తులతో కలిసి ‘అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఎన్ఓసీ, ఫైర్ సెఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో పక్క ప్రముఖ హోటళ్లు, మాల్స్, మల్టీప్లెక్స్, ఇతర వాణిజ్య ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే నోటీసులు జారీ చేస్తున్నారు.
15 రోజుల సమయం ఇచ్చి అప్పటికీ నిబంధనలు పాటించకుంటే సంబంధిత వాణిజ్య సముదాన్ని సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఇనార్బిట్ మాల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డీఆర్ఎఫ్ బృందంలో వై.కరుణాకర్, మహ్మద్ పర్వీజ్ఖాన్, మహ్మద్ ఇస్మాయిల్, సి.నికిల్ చావన్, బి.రాజు ఆధ్వర్యంలో అవెర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.
ప్రమాదాల సమయంలో కాల్ చేయండి