హైదరాబాద్ : హైదరాబాద్లోని మైలార్దేవ్(Mylardevpally) పల్లిలో భారీ అగ్నిప్రమాదం(Fire incident) చోటుచేసుకుంది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్(Plastic godown)లో రాత్రి ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే మంటలు భారీగా చెలరేగాయి.
వాటిని అదుపు చేయడానికి దాదాపు 4గంటల సమయం పట్టింది. మంటల్లో ప్రాణనష్టం జరగనట్లు సమాచారం. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంటుందని చెబుతున్నారు. మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మాత్రం ఈ గోడౌన్ ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.