హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆదివారం రాత్రి భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పద్మజా హోటల్లోని టెర్రస్పై మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా సాయంత్రం.. పాతబస్తీ ఆజంపురాలోని టైర్ల గోడౌన్లో మంటలు భారీగా ఎసిగిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో టైర్లన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.