హైదరాబాద్ : ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. నర్మదా ఆస్పత్రిలోని జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం జరిగిన ఆస్పత్రిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు.