హైదరాబాద్ : సికింద్రాబాద్లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేశాడు. క్షణాల్లోనే కారులో ఉన్న వారందరూ బయటకు దిగేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.