హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గంపలబస్తీలోని ఎస్బీఐ కో ఆపరేటివ్ సొసైటీలోని ఓ కెమికల్ డ్రమ్ముల గోదాంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గోదాం అంతటా వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదం నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.