Hyderabad | హైదరాబాద్ : జీడిమెట్ల( Jeedimetla ) పరిధిలోని ఆరోరా ఫార్మాస్యూటికల్స్( Aurora Pharma ) పరిశ్రమలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు ధాటికి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మృతి చెందిన కార్మికులను రవీందర్ రెడ్డి(25), కుమార్(24)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.