Hyderabad | హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లోని ఓ బట్టల దుకాణంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 8 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కానీ అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతుండటంతో మంటలు ఆర్పడం కష్టమవుతోంది.
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
పాతబస్తీలోని మదీనా చౌరస్తా వద్ద బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
మంటలు ఆర్పడానికి రెండు గంటలుగా శ్రమిస్తున్న ఎనిమిది అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది pic.twitter.com/XzrbMa54go
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026