కందుకూరు : రైతులు సామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమైలారంలో మీర్ఖాన్పేట్లో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 10లక్షల రూపాలయతో నిర్మించే ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన చేశారు.అదే విధంగా సీసీ రోడ్లను, వైకుంఠ ధామలను ప్రారంభించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. వావిళ్లకుంట తండలో 79లక్షల 60వేల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లు, అండర్డ్రైనేజి పనులకు శంకుస్థాన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పామాయిల్ పంటలను సాగు చేస్తే ప్రభుత్వం ఎకరాకు 30వేల రూపాయలను సబ్పిడీ ఇస్తుందని తెలిపారు. ఆ పంట 30సంవత్సరాల పాటు ఉంటుందని వివరించారు. రైతులు లాభసాటి పంటలను వేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. రైతులకు మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. వరి సాగులో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు.
రైతు బీమా, రైతు బంధు రైతుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నట్లు తెలిపారు.రైతు బీమాకు ప్రభుత్వం ప్రతియేటా 1200కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.ఉచిత విద్యుత్కు 10వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.అటు చినుకులు పడగానే ఇటు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్లు పేర్కొన్నారు.దళిత బంధు పథకం చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు. దీనికి కూడ ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని అన్నారు.
సర్పంచ్ జ్యోతి చంద్రశేఖర్ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లకా్ష్మారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైఎస్ ఎంపీపీ శమంత ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, మండల రైతు బంధు అద్యక్షులు క్రిష్ణరాంభూపాల్రెడ్డి పాల్గొన్నారు.