శామీర్పేట, జూలై 19 : పూటకో మాటతో రేవంత్రెడ్డి పబ్బం గడుపుతున్నాడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పి బుధవారం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు విని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ బాట పట్టారని అన్నారు. రైతులు సంఘటితమై రేవంత్రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుచింతలపల్లి మండలంగా ఏర్పాటు చేసి, అభివృద్ధి కోసం రూ.69 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, ఎంపీపీ హారిక, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్లు జామ్ రవి, ఇస్తారి, ఆంజనేయులు, విష్ణువర్ధన్రెడ్డి, హరిమోహన్రెడ్డి, కృపాకర్రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశ్గౌడ్, సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో 150 మంది చేరిక
మూడుచింతలపల్లి మండల పర్యటనలో భాగంగా మంత్రి మల్లారెడ్డి సమక్ష్యంలో యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చున్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం మండల అధ్యక్షుడు ర్యాకల నీరజ్గౌడ్, కేశ్వాపూర్ గ్రామ ఉపసర్పంచ్ పోచమ్మ, 1వ వార్డు సభ్యుడు గణేశ్గౌడ్తో పాటు 150 మంది కార్యకర్తలు జగ్గంగూడ, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నీరజ్గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.