పరిగి, జూన్ 12 : ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని రైతులు ఆమరణ దీక్ష చేపట్టారు. కాగా, కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు రంగాపూర్ స్టేజీ వద్ద అడ్డగించి మహేశ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చన్గోముల్ పీఎస్కు తరలించారు. మరోవైపు తమ భూములను ఇచ్చేది లేదంటూ కాళ్లాపూర్ గ్రామ రైతులు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం కూడా కొనసాగింది.