హైదరాబాద్: హైదరాబాద్లోని బాలాపూర్లో పెద్దమొత్తంలో నకిలీ నోట్లు (Fake Notes) పట్టుబడ్డాయి. గురువారం ఉదయం బాలాపూర్లో ఎస్వోటీ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠా పట్టుబడింది. వారినుంచి రూ.25 లక్షల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మహారాష్ట్ర నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులు షేక్ హరుణ్, సయ్యద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ను అరెస్టు చేశారు. వారంతా మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు తెలిపారు.