అల్వాల్, నవంబర్ 26 : దేశ పౌరులందరూ సమాన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భారత రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని జ రుపుకోవడం శుభపరిణామమని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. శనివారం భార త రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు, సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లాడుతూ.. దేశాన్ని ఏక తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజు పాల్గొన్నారు.
మల్కాజిగిరి, నవంబర్ 26: రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్ అంబేద్కర్ గొప్ప మేధావి అని, ఆయనను ప్ర తి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్కుమార్ అన్నారు. శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ చింతల్బస్తీ, ఆనంద్బాగ్ చౌరస్తాలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు కార్పొరేటర్, నాయకులు పూల మాలలువేసి నివాళులర్పించారు. అలాగే.. నేరేడ్మెట్లోని అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సత్యమూర్తి, సత్యనారాయణ, నవీన్యాదవ్, శంకర్రావు, ఉమాపతి, నర్సింగ్రావు, బ్రహ్మయ్య, కవిత, కృష్ణంరాజు, రాము, రత్నభూషన్, గణేశ్ పాల్గొన్నారు.
నవంబర్ 26 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నవంబర్ 26న ఆమోదించిన సందర్భంగా శనివారం సుమంగళి ఫంక్షన్హాల్లో జరిగిన కా ర్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాద్, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాముయాదవ్ పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మౌలాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మద్దూరి దుర్గేశ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళితరత్న అవార్డు గ్రహిత నాగేశ్, సంఘం సభ్యులు, నాయకులు కృష్ణ, సత్యనారాయణ, నరేందర్, గున్నాల లక్ష్మణ్గౌడ్, అమీనొద్దీన్, భాగ్యానందరావు తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్, నవంబర్ 26 : రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మల్కాజిగిరి టీఆర్ఎస్ ఇన్చార్జి బద్దం పరుశురాంరెడ్డి అన్నారు. వినాయక్నగర్ డివిజన్, రైల్వేట్రాక్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి అరుణ్ జ్యోతి యూత్ ఆధ్వర్యంలో పూ లమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడు తూ.. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా భారతదేశం లో మార్పులు చోటు చేసుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో తులసీ సురేశ్, ప్రభాకర్రెడ్డి, ఫరీద్బా య్, బాలకృష్ణ గుప్తా, చంద్రకాంత్, ఉమేశ్, పేపర్ శ్రీను, కరీంభాయ్, ఓంప్రకాశ్, లారెన్స్, రజిత పాల్గొన్నారు.