త్వరలోనే రెండో విడతలో స్కూల్ అసిస్టెంట్లు, పండితులు, హెచ్ఎంలకు శిక్షణ
జిల్లాలో టీచర్లకు తొలి విడత ముగిసిన ఇంగ్లిష్ శిక్షణ కార్యక్రమం
హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లతో పాటు ఎస్జీటీ టీచర్లకు శిక్షణ
తొలుత విడుతలో 2,400 మంది ఎస్జీటీలకు శిక్షణ పూర్తి
సిటీబ్యూరో, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఇం గ్లిష్ మీడియం బోధనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే స్కూల్ టీచర్లందరికీ ఇంగ్లిష్ మీడియం బోధన ఏ విధంగా చేపట్టాలి? అన్న అంశంపై ఇంగ్లిష్ రిసోర్స్ వ్యక్తులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగింపుగా.. ఇంగ్లిష్తో తొలి విడుదల ఇంగ్లిష్ శిక్షణ కార్యక్రమాలు ముగిసినట్లు జిల్లా డీఈవో రోహిణి, నేషనల్ ఐసీటీ అవార్డు గ్రహీత, నేషనల్ కౌన్సెలర్, స్టేట్ ఇంగ్లిష్ రిసోర్స్ పర్సన్ ఉమారాణి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 206 స్కూళ్లు ఉన్నాయి. వారిలో తొలి విడతలో 2,400 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీల) శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, పాఠశాల విద్యా శాఖ భాగస్వామ్యంగా ప్రభుత్వ టీచర్లందరికీ ఇంగ్లీష్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే రెండో శిక్షణ కార్యక్రమంలో అన్ని రకాల ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు, హెడ్ మాస్టర్లకు, భాషా పండితులకు, అవసరమైతే పీఈటీలకు కూడా ఇంగ్లిష్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు.