కాటేపల్లి జనార్దన్ రెడ్డి
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 13 : ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషలో బోధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులంతా ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని మెలుకువలు నేర్చుకోవాలని వాటిని తరగతి గదుల్లో వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో శిక్షణా కేంద్రాల హెడ్ నరేందర్ రెడ్డి, సంధ్యారెడ్డి, పీఆర్టీయూ నేతలు రామేశ్వర్ గౌడ్, శ్రీధర్, నరేందర్ గౌడ్, నర్సింహులు, బ్రహ్మానందరెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.