ఖైరతాబాద్, మార్చి 22: ‘ఉద్యోగులకు ఇచ్చిన హామీ ని నిలబెట్టుకున్నారు…మాట తప్పని….మడమ తిప్పని నేత సీఎంకేసీఆర్’ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం (కేంద్ర కమిటీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు.సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతులు, ఇతర బలహీనవర్గాల పక్షమే కాదు ఉద్యోగుల పక్షపాతి అని మరో సారి రుజువైందన్నారు. గతంలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే…నేడు పే రివిజన్ కమిటీ 7.5 రికమండ్ చేస్తే సీఎం కేసీఆర్ 30 శాతానికి పెంచి ఉద్యోగుల పట్ల తన ఔదర్యాన్ని చాటుకున్నారన్నారు.ఉద్యోగ విరమణ వయస్సును 58నుంచి 61 ఏండ్లు పెంపుతో పాటు గ్రాట్యుటీ రూ.12లక్షల నుంచి రూ.16లక్షలకు పెంచడం ఓ చారిత్రాత్మక నిర్ణయమన్నా రు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్ష న్ స్కీమ్ను వర్తింప చేయడం లాంటి నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతో ఊరట కలిగిస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతి ఉద్యోగి రుణపడి ఉంటారన్నారు.ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు దేవేందర్, కార్యదర్శి వెంకట్రావు, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణా రావు, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాదాస్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ వేదికగా సోమవారం సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ద్వారా హైదరాబాద్ పరిధిలో 1,67,922 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్ జిల్లాలో 50వేలకు పైగా ఉద్యోగులు, 45 వేలకుపైగా ఉపాధ్యాయులు ఉండగా, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 10వేల మంది, పెన్షనర్లు 15వేల మంది ఉన్నారు. పీఆర్సీ ద్వారా వారందరికీ లబ్ధి చేకూరనుంది.రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు-18,183 మంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు-1064,ఔట్సోర్సింగ్ ఉద్యోగులు-1150, పెన్షనర్లు-7900,వీఆర్వోలు-277, వీఆర్ఏలు-863, 1145 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సర్వశిక్షాఅభియాన్ ఉద్యోగులు-10 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మేడ్చల్ జిల్లా పరిధిలో 8,300 రెగ్యులర్ ఉద్యోగులు, 4వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, 5000వేల మంది పెన్షనర్లు ఉండగా మొ త్తంగా 17,300 మందికి లబ్ధి చేకూరనుంది.
జీహెచ్ఎంసీలో 858, జలమండలిలో 450 మందికి లబ్ధి
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో 858 మంది ఉద్యోగులు, జలమండలికి చెందిన దాదాపు 450 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ విరమణ వయస్సు పెంపును ప్రకటించడం గొప్ప విషయమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
వైద్యశాఖలో 2.28లక్షల మందికి ప్రయోజనం
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్కుమార్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సం ఘం (డీహెచ్) అధ్యక్షుడు డాక్టర్ లల్లూప్రసాద్ రాథోడ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రమేశ్, కన్వినర్ శ్రీనివాస్, టీజీఓ అధ్యక్షు డు రాజేందర్ మాట్లాడుతూ 30శాతం ఫిట్మెంట్తో డీహెచ్, వైద్యవిధాన పరిషత్ పరిధిలోని సుమారు 2.28 లక్షల మంది వైద్యసిబ్బందికి పీఆర్సీతో లబ్ధి చేకూరనుంది. 5000మంది వైద్యులు, సుమారు 40వేల మంది నర్సింగ్ సిబ్బంది, 3వేల మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 1500మంది ఫార్మసిస్టులు, సుమారు 10వేల మంది మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఇతర రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం దాదాపు 2.28లక్షల మంది వైద్యసిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా పలు వైద్య సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.