సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రేటర్లో ప్రచారం ఊపందుకున్నది. పార్టీలన్నీ ఇంటింటి ప్రచారానికి తెరలేపాయి. దీంతో కాలనీ లు, గల్లీలు, బస్తీలకు ఎన్నికల హడావుడి చేరుకున్నది. అయితే, దాదాపు 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచార హడావుడి పెద్ద ఎత్తున జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధమైన ప్రచార తీరు ప్రతిపక్షాల క్యాడర్ను కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. ప్రత్యర్థుల కంటే ముందుగానే కారు గుర్తు చేరేలా గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఆశించిన మేర ప్రచారం జరగడం లేదని ప్రతిపక్షాలు, క్యాడర్ డీలా పడిపోతున్నది.
ఇంటింటి ప్రచారాలు..
ఎన్నికలు అంటేనే ప్రచారాలు, కర పత్రాల పంపిణీలు, ఇంటింటికి పార్టీల అజెండాను చేరవేసేలా చేరికలు, ముఖ్య నేతలతో కీలక సమావేశాలతో రాజకీయ పార్టీల కార్యాలయాలన్నీ సందడిగా మారిపోతుంటాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రేటర్లో ప్రచా రం హడావుడి తారా స్థాయికి చేరింది. కానీ, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారమే ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. ప్రధానంగా గ్రేటర్లో బస్తీలు, అపార్టుమెంట్లు, కాలనీలతో పాటు విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపడుతుంటూ విపక్షాలకు చుక్కలు చూపుతోంది. ఇప్ప టి వరకు విపక్ష అభ్యర్థులు ఖరారు పూర్తి అయినా.. ప్రధానంగా బీజే పీ, కాంగ్రెస్ల తీరు సొంత నాయకులనే కలవర పెడుతున్నది.
సంక్షేమాలతో బీఆర్ఎస్లో జోష్
ఇంటింటికి తాగునీరు, మెరుగైన మౌలిక వసతులను బీఆర్ఎస్ అందించడం విపక్షాలకు మింగుపడటం లేదు. గతంలో నీళ్ల కోసం కొట్లాడిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ.. ఏం చేశారంటూ ఓటర్లు విపక్ష నేతలను ప్రశ్నిస్తున్నారు. ఇక నగరంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన వరద నీటి సమస్యపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో 70 శాతానికి పైగా సమస్యకు పరిష్కారం చూపింది. ఇవే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచార అస్ర్తాలుగా మారి విపక్షాలను నిలువరిస్తున్నాయి.
చేతులెత్తేసిన విపక్షాలు..
గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 15 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ దూకుడు ప్రచారంతో చేతులెత్తిశారు. ఇప్పటికీ కనీసం బూత్ లెవల్ కమిటీ సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇక ఇంటింటి గులాబీ జెండాలు చేరుతుండటం, ఆనుకున్న దానికి కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ఆదరణ పెరగడం విపక్షాల క్యాడర్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో బలంగా ప్రచారం చేస్తుండటం మిగతా పార్టీలను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి.
మేడ్చల్ అంతటా బీఆర్ఎస్ గెలుపు ఖాయం
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచార సభలకు విశేష స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి వస్తు న్న స్పందన నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో గెలుపు ఖా యమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, కృష్ణారావు, రాజశేఖర్రెడ్డి, లక్ష్మారెడ్డిలు ప్రచార సభలు, రోడ్ షోలు, ఇంటి ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా సంక్షే మ పథకాలను అమలు చేస్తున్న క్రమంలో జరగనున్న ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలు అర్హులైన వారికి మరింత మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు.