హైదరాబాద్ : హైదరాబాద్లో 8 మంది బాల కార్మికులకు విముక్తి కలిగింది. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫలక్నూమా పోలీసులు కలిసి సంయుక్తంగా ఫాతిమా నగర్లో తనిఖీలు నిర్వహించారు. బ్యాగ్, ఆటో మొబైల్ సీట్ కవర్ తయారీ పరిశ్రమల్లో పని చేస్తున్న 8 మంది బాల కార్మికులను పోలీసులు కాపాడారు.
ఈ పరిశ్రమల యజమాని షేక్ తఫిక్(32)ను పోలీసులు అరెస్టు చేసి ఫలక్నూమా పోలీసు స్టేషన్కు తరలించారు. బాధిత పిల్లలంతా బీహార్కు చెందిన వారని పోలీసులు తేల్చారు. గంటల తరబడి పిల్లల చేత పని చేయించి, వారిని హింసిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని స్పష్టం చేశారు. మంచి ఆహారం కూడా వారికి అందించడం లేదని పోలీసులు తెలిపారు. ఈ 8 బాలకార్మికులను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగిస్తామన్నారు.