కవాడిగూడ, జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్ని, జలమండలి డీజీఎం ఎం. చంద్రశేఖర్, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్ లతో కలిసి పాదయాత్ర నిర్వహించి బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగాడికుంట-మొదటి, రెండవ బస్తీలలో ముఖ్యంగా తాగునీటి, డ్రైనేజీ, రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ సమస్యలున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నగర నాయకుడు ముఠా జయసింహ, నాయకులు రాజశేఖర్ గౌడ్, రాంచందర్, మల్లేశ్, జంగా శ్రీనివాస్, జమాల్ పాల్గొన్నారు.
క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ..
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గాపాల్ అన్నారు. ఈ మేరకు శనివానం కవాడిగూడ డివిజన్లోని ఏసీటీసీ కాలేజీలో గల చర్చి ఆడిటోరియంలో క్రైస్తవుల కృతజ్ఞత సభ రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రావులపాటి మోజెస్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దికి సముచిత స్థానం కల్పిస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను క్రైస్తవులు సత్కరించారు ముఠా జయసింహ, శ్యామ్ అబ్రహం, మాజీ కార్పొరేటర్ రవీందర్, సాల్మన్ రాజు పాల్గొన్నారు.