కార్వాన్, ఫిబ్రవరి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో పాతబస్తీ జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్లతో కలిసి పాతబస్తీలోని నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పాతబస్తీ, అభివృద్ధి, ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తుందని పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారన్నారు. వృద్ధులు, వితంతువు, దివ్యాంగులు, ఒంటరి మహిళల కోసం ఆసరా పథకం ఆదుకుంటుందన్నారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధితో సాయం అందుతుందన్నారు. మరోవైపు దళితుల కోసం దళిత బంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. దశలవారీగా అర్హులైన వారందరూ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, ఇన్చార్జిలు జీవన్ సింగ్, ఆనంద్ గౌడ్, నందు బిలాల్ పాల్గొన్నారు.