శంషాబాద్ రూరల్ : మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ పట్టణంలోని రైల్వేకమాన్ వద్ద రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం పట్టణప్రగతి నిధుల నుంచి 15 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలను అన్ని రంగాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రణాళిక ద్వారా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో చైర్మన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్, గణేష్గుప్త, చంద్రారెడ్డి, కౌన్సిలర్లు అజయ్, తోకల విజయలక్ష్మీ, అయిల్ కుమార్, మేకల వెంకటేశ్, నాయకులు మంచర్ల మోహన్రావు, మురళీయాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.