మహేశ్వరం, మే 13: బీఆర్ఎస్తోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు సర్పంచ్ బండారు లావణ్యలింగం, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, ఉప సర్పంచ్ లతీఫ్ఖాన్, నియోజక వర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు వార్డు సభ్యులు బూర్గుల రాజు, సోమ్లానాయక్, బాలు నాయక్, కే. నర్సింహ, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్, బీజేపీ యూత్ అధ్యక్షుడు రఘునాయక్, యాదగిరి, రాజు, బండారి శేఖర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ తదితరులు పాల్గొన్నారు.