పర్యావరణ హితమే తమ అభిమతమంటున్నారు నగరవాసులు. రసాయన రహిత విగ్రహాలను పూజించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగా ఎనిమిది అంగుళాల పొడవైన 75 వేల మట్టి విగ్రహాల పంపిణీని జీహెచ్ఎంసీ బుధవారం నుంచి ప్రారంభించింది. 31 సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, గురువారం కూడా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏ కూడా రూ.23 లక్షల వ్యయంతో తయారు చేసిన 70 వేల ప్రతిమల పంపిణీని నాలుగైదురోజుల కిందటే ప్రారంభించింది. భారీ సంఖ్యలో కావాల్సి ఉంటే నేరుగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వద్దకే పంపుతామని ప్రకటించింది. కాగా ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం నిమజ్జనం జరిగే ప్రాంతాలను సందర్శించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టింది. బుధవారం నగరంలోని 23 కేంద్రాల్లో ఉచితంగా మట్టి గణేశులను పంపిణీ చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో గురువారం కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. సుమారు రూ.23లక్షల వ్యయంతో 70 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించామని, నగర వాసులు మట్టి ప్రతిమలను ప్రతిష్టించి పూజలు చేయాలని అధికారులు సూచించారు.
తార్నాక హుడా కాంప్లెక్సు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్, దుర్గం చెరువు, కేబీఆర్ పార్కు, మైండ్ స్పేస్ జంక్షన్, కుందన్బాగ్, అమీర్పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం మైత్రీవనం, స్వర్ణజయంతి కాంప్లెక్సు, ఉప్పల్ శిల్పారామం ప్రాంతాల్లో పంపిణీ చేశామన్నారు. మొబైల్ బృందాల ద్వారా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో, అపార్టుమెంట్ల వద్ద ఉచితంగా అందజేశామని హెచ్ఎండీఏ అధికారులు చెప్పారు.
ప్రతి ఒకరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని టీఎన్జీవో అసోసియేషన్ జలమండలి విభాగం అధ్యక్షుడు మహేశ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో టీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బందికి మట్టి గణపతిలను పంపిణీ చేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో గురు, శుక్రవారాల్లోనూ మట్టి ప్రతిమల పంపిణీ ఉంటుందని, అవసరమైన వారు వచ్చి తీసుకోవచ్చని టీఎన్జీవో నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు రజినీకాంత్, సంతోష్, అజయ్ సింగ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా సర్కిల్ (6 కేంద్రాలు) 2163 మైత్రి 9000115239
ఉప్పల్ (4 కేంద్రాలు) 2163 చందన 9701363239.
హయత్నగర్ (3 కేంద్రాలు) 2163 మంజులవాణి 79950 79806
ఎల్బీనగర్ (4 కేంద్రాలు) 2163 వెంకటేశ్ 9701365515
సరూర్నగర్ (5 కేంద్రాలు) 2163 నీలిమ 9000114676
మలక్పేట, సైదాబాద్ 2163 కేవీఎస్ ప్రసాద్ 79950 20400
ఐఎస్ సదన్ కమ్యూనిటీ హాల్ 2163 ఇక్భాల్ 814300030
చంద్రాయణగుట్ట (2 కేంద్రాలు) 2163 పళవన్కుమార్ 9154299696
చార్మినార్ (4 కేంద్రాలు) 2163 శ్రీనివాస్ 9154686560
ఫలక్నుమా (4 కేంద్రాలు) 2163 మన్వార్ ఆలీ 99851 50414
రాజేంద్రనగర్ 2163 డాక్టర్ పి. పద్మ 8008554908
మెహిదీపట్నం 2163 అజీజ్ఖాసిం 9701362898
కార్వాన్ 2163 అనిల 8106450227
గోషామహల్ (6 కేంద్రాలు) 2163 ఉమాగౌరీ 79950 20441
ఖైరతాబాద్ (4 కేంద్రాలు) 2163 భార్గవ 8374865307
జూబ్లీహిల్స్ 2163 రవికాంత్ 7995007422
యూసుఫ్గూడ 2163 బిందు భార్గవి 79950 79809
శేరిలింగంపల్లి (3 కేంద్రాలు) 2163 కేఎస్ రవి 8008554962
చందానగర్ (5 కేంద్రాలు) 2163 కార్తీక్ 7799910381
ఆర్సీపురం 2163 డాక్టర్ రంజిత్ 9866699401
మూసాపేట (4 కేంద్రాలు) 2163 డాక్టర్ ప్రతాప్ 79950 20439
కూకట్పల్లి 2163 చంద్రశేఖర్ 79933 60308
కుత్భుల్లాపూర్ (4 కేంద్రాలు) 2163 భాను చందర్ 9154299718
గాజులరామారం (4 కేంద్రాలు) 2163 ప్రశాంతి 9963833011
అల్వాల్ 2163 డాక్టర్ కె. నిర్మల 9701363243
ముషీరాబాద్ (6 కేంద్రాలు) 2163 హేమలత 7993354269
అంబర్పేట (3 కేంద్రాలు) 2163 జ్యోతీబాయి 6309999493
మల్కాజ్గిరి (6 కేంద్రాలు) 2163 మాధవి 8106556160
సికింద్రాబాద్ (5 కేంద్రాలు) 2163 రవీందర్ గౌడ్ 7993360302
బేగంపేట (4 కేంద్రాలు) 2163 ప్రవీణ్కుమార్ 9908017194
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 10100 డాక్టర్ కె. పద్మజ 63099 19076