అబిడ్స్, ఏప్రిల్ 4 : ముందుగా ఆస్తి పన్నును వసూలు చేసేందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్ పథకం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడనున్నది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను గడువు తేదీ మార్చి 3కి ముగిసిన విషయం విదితమే. ఈ నెల 1న ఈ ఎర్లీ బర్డ్ పథకాన్ని జీహెచ్ఎంసీ ప్రకటించగా అధికారులు పథకం ద్వారా పన్ను వసూలు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముందుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి జీహెచ్ఎంసీ ఐదు శాతం రిబేటును ఇస్తోంది. ఏప్రిల్ 30 లోపు పన్ను చెల్లించే వారు ఐదు శాతం తగ్గించుకుని చెల్లించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా పన్ను వసూలు చేసేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గడువు తేదీ లోపు ఆస్తి పన్ను చెల్లించని వారికి రెండు శాతం అపరాధ రుసుం విధిస్తున్న జీహెచ్ఎంసీ ముందుగా పన్ను చెల్లించే వారికి రిబేటు కల్పించేందుకు గాను ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. 2017 లో 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఈ పథకం ద్వారా ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూలైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రజల్లో అవగాహన పెరుగడంతో ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని చెల్లింపులు చేసుకుంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎర్లీ బర్డ్ పథకం ద్వారా జీహెచ్ఎంసీకి రెవెన్యూ పెరుగుతోంది. ఈ సంవత్సరం ఎర్లీ బర్డ్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం పథకంలో భాగంగా సర్కిల్ కార్యాలయం పరిధిలో ఏప్రిల్ 30 లోపు పెద్ద మొత్తంలో పన్ను వసూలు కాగా ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీబర్డ్ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలలో భాగంగా ముందుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబేట్ను కల్పించే వసతిని కల్పించింది. ఐతే అత్యధికులకు ఈ విషయం తెలియక పోవడంతో వారికి తెలియ చేసేందుకు గాను అధికారులు చర్యలను ప్రారంభించారు. ఎర్లీ బర్డ్ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఐదు శాతం రాయితీతో పన్ను చెల్లించుకోండి. కొన్నేండ్లుగా ఈ పథకం ద్వారా ఏప్రిల్ మాసంలో భారీ ఎత్తున పన్ను వసూలవుతోంది. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో వసూలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై ప్రచారాన్ని నిర్వహిస్తాం. ప్రజలకు పథకంపై అవగాహన కల్పించి పన్ను వసూలయ్యేలా చూస్తాం. మంగళవారం ఒక రోజు రూ.20 లక్షల వరకు పన్ను వసూలైంది.