GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించింది.
ఈ ఎర్లీబర్డ్ ఆఫర్ను గృహ, వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించిన వారికే ఈ 5 శాతం రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఎర్లీబర్డ్ పథకం కింద రూ. 800కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, తొలిరోజు సోమవారం బల్దియా రూ. 9 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకున్నది.