సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
అయితే ఈ స్కీంకు 4 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.