బంజారాహిల్స్/హిమాయత్నగర్,అక్టోబర్ 24: విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయంలో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మాగంటిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికలలో మరోసారి విజయం సాధించాలంటూ పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్తో పాటు పలు డివిజన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఇందిరానగర్లో శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన దసరా వేడుకల్లో కార్పొరేటర్ పి.విజయారెడ్డి , స్తానిక నేతలు మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చింతల్బస్తీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు.
నారాయణగూడ పీఎస్లో ప్రత్యేక పూజలు
విజయ దశమి సందర్భంగా నారాయణ గూడ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీఐ యు.చంద్ర శేఖర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు మించిన శక్తి లేదని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలోడీఐ నాగార్జున ఎస్సైలు షఫీ,నరేష్కుమార్,వెంకటేశ్,శిరీష రాజేష్ పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.