Drinking Water | సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్ -2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్సీ పురం, అశోక్నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, ఓఅండ్ఎం డివిజన్ 24లోని బీరంగూడ, అమీన్పూర్, ట్రాన్స్మిషన్ డివిజన్ 2లోని ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఓ అండ్ ఎం డివిజన్ 6లోని ఎర్రగుడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్పేట తదితరుల చోట్ల తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.