సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కుకునూర్ వద్ద రైల్వే శాఖ నూతనంగా ట్రాక్లైన్ను నిర్మించతలపెట్టింది. దీని కారణంగా హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి తొలి విడుత పథకంలో భాగంగా కొండపాక నుంచి ఘన్పూర్కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్ను పక్కకు మార్చాల్సి ఉంది. దీంతో ఈనెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నీటి సరఫరా కాని ప్రాంతాలు
షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణీకెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజులరామారం, సూరారం, మల్కాజిగిరి ఢిపెన్స్ కాలనీ, నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి) ఘన్పూర్ (మేడ్చల్/శామీర్పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాల్లో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు నీటి సరఫరా ఉండదని అధికారులు చెప్పారు. నీటి పొదుపుగా వాడుకుని అధికారులకు సహకరించాలని కోరారు.
పాక్షికంగా నీటి సరఫరా జరిగే ప్రాంతాలు
బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్పేట, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్గూడ, కేపీహెచ్బీ కాలనీ, మలేషియా టౌన్షిప్, లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు ప్రాంతాలు, గోపాల్నగర్, మయూర్ నగర్ రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్, నిజాంపేట్/బాచుపల్లి ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరా ఉంటుందని అధికారులు తెలిపారు.