బంజారాహిల్స్,మే 27: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూలై 4నుంచి నిర్వహించనున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఎమ్ కామ్, ఎంఎస్సీ. ఎమ్ఎల్ఎస్సీ, బీఎల్ఐఎస్సీ తదితర కోర్సులతో పాటు అన్ని డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యూనివర్సిటీకి సంబంధించిన పోర్టల్లో పరీక్షల రిజిస్ట్రేషన్ లింక్ను క్లిక్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని, ఫీజులను టీఎస్, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జూన్ 14లోగా అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.