బంజారాహిల్స్,డిసెంబర్ 20 : సైనిక సిబ్బందికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(ఏఓసీ) సెంటర్ల మద్యన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
సోమవారం జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ఒప్పంద పత్రాలను వైస్ చాన్స్లర్ ప్రొ.కే.సీతారామారావు సమక్షంలో ఏవోసీ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ అజిత్ అశోక్ దేశ్పాండే, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.ఏవీఎన్.రెడ్డి మార్చుకున్నారు.
ఈ సందర్బంగా వైస్ చాన్స్లర్ ప్రొ. సీతారామారావు మాట్లాడుతూ..ఇప్పటికే ఈ సంస్థల మద్యన ఉన్న ఒప్పందానికి అదనంగా మరిన్ని కోర్సులను ఆర్మీ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు కొత్త ఒప్పందం దోహదపడుతుందన్నారు.
ఈ కోర్సులను పూర్తిచేయడం ద్వారా పదవీ విరమణ పొందిన తర్వాత సెకండ్ కెరీర్ను మరింత మెరుగ్గా మలుచుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. సికింద్రాబాద్లోని ఏవోసీ సెంటర్లో త్వరలోనే లెర్నింగ్ పపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యుటీ కమాండెంట్ కల్నల్ ప్రిన్స్ దత్తా, లెఫ్ట్నెంట్ కల్నల్ విరాజ్ సెమ్వాల్, సుబేదార్ మేజర్ బోర్కర్ తదితరులు పాల్గొన్నారు.