మియాపూర్ , జూన్ 14 : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని, ఇది ఎంతో గొప్పదని.. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని, నిజమైన అర్హులైన లబ్ధిదారుకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు జరగాలన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల పురోగతిపై జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సహచర ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్ యాదవ్, కలెక్టర్ అయోయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్తో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గుల్మోహర్ పార్కు, సాయినగర్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నందున అర్హులైన పేదలకే కేటాయించేలా పకడ్బందీగా వ్యవహరించాలని కోరారు. జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే గృహాల్లో జరిగిన అక్రమాలను అరికట్టి.. గతంలో దరఖాస్తు చేసుకుని డబ్బులు చెల్లించిన నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలని గాంధీ కోరారు. దళారులు కొందరు ఈ గృహాలను అమ్ముకున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, అక్రమ దారులవల్ల నిజమైన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సహా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. అక్రమాలను అరికట్టాలని ఆయన కోరారు. స్పందించిన మంత్రి సబితారెడ్డి.. సదరు ఇండ్లపై విచారణ చేపట్టి వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు విప్ గాంధీ తెలిపారు.
హఫీజ్పేట్ డివిజన్లోని మదీనాగూడ రామకృష్ణానగర్కు చెందిన సంజీవ్కు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 24 వేల చెక్కును విప్ అరెకపూడి గాంధీ.. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి సోమవారం బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థిక భరోసాను అందిస్తూ.. అనారోగ్యాల నుంచి బయటపడేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. నిరంతర సేవల ద్వారా పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సైదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.