Putta Vishnu | ఆ గాడిద దొంగ కేసు ఎవరైతే ఎదుర్కొంటున్నరో ఆ ఎమ్మెల్సీ (బల్మూరి వెంకట్) నిన్న ప్రెస్మీట్లో ఆయనకు స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆసక్తికర విషయం చెప్పిండని బీఆర్ఎస్ నాయకుడు పుట్టా విష్ణు అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయననట పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడితే కేటీఆర్ పీఏ ఎవరో, పీఆర్వో ఎవరో ఆయనే గుర్తు పట్టలేదట..అట్లాంటిది పోలీస్ స్టేషన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎట్లా గుర్తు పట్టిర్రు అంటడు.. మేం కూడా ఈ గాడిద దొంగ సన్నాసికి అదే చెప్తున్నం. మెడకాయ మీద తలకాయ ఉండి.. తలకాయలో గుజ్జుంటే నువ్వు 10 సంవత్సరాలు రాజకీయంలో ఉండి.. ప్రతిపక్షంలో ఉండి పోరాడితేనే నువ్వు గుర్తు పట్టని కేటీఆర్ పీఏ, పీఆర్వోను ఎవరో బస్తీలో పోరలు డీజే అనుమతి కోసం వచ్చినోళ్లు 15-20 మంది లోపలికి వచ్చి ఇంటరాగేషన్ రూంలో మాస్క్లు పెట్టుకొని వాళ్లంతా ఒకేసారి గుర్తు పట్టి దాడిచేస్తారా..? అని అడిగారు.
ఒక స్క్రిప్ట్ చెప్పే ముందు ఆ చదివే స్క్రిప్ట్లో కూడా ఇది నమ్మశక్యంగా ఉంటుందా..? లేదా..? ప్రజలు నమ్ముతరా.. లేదా.. ? అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఏది రాసిస్తే అది చెప్పడమే.. అంటూ పుట్టా విష్ణు ఫైర్ అయ్యారు. గాడిద దొంగలు, రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన సన్నాసులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ నాయకులను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, వాటిని అమలు చేయలేక ఇలా ప్రతిపక్షాలను తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇకనైనా హామీల మీద దృష్టి పెట్టకపోతే ప్రజలే కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతారని హెచ్చరించారు.
గాడిద దొంగలు, రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన సన్నాసులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ నాయకులను దూషించడమే పనిగా పెట్టుకున్నారు.
ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, వాటిని అమలు చేయలేక ఇలా ప్రతిపక్షాలను తిట్టుకుంటూ… pic.twitter.com/HHyNuETfrK
— BRS Party (@BRSparty) September 16, 2026
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల