Osmania | సుల్తాన్బజార్, ఫిబ్రవరి 21: ఉస్మానియా దవాఖాన వైద్యులు మరో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 240 కిలోల బరువున్న అతి ఊబకాయ రోగికి సర్జరీ ద్వారా 70 కిలోల బరువును తగ్గించారు. అతి ఊబకాయ రోగికి శస్త్రచికిత్సతో బరువు తగ్గడం ప్రభుత్వ దవాఖానలో ఇదే తొలిసారి కావడం విశేషం.
సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్థీషియా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సర్జరీ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. కడుపు సామర్థ్యం తగ్గింపుతోపాటు శోషకశక్తిని తగ్గించే కాంబినేషన్ సర్జరీ ఇది అని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ వివరించారు. బరువు పెరుగుదల పునఃస్థితిని నివారించడానికి పేగుల సామర్ధ్యం కూడా తగ్గించామని, రెండు నెలల్లో ఊబకాయ రోగి 70 కిలోల బరువును తగ్గించగలగడం విజయానికి సంకేతమని తెలిపారు. గతంలో ఊబకాయ రోగులకు సాధారణ కడుపు సామర్ధ్యం తగ్గింపు శస్త్రచికిత్స చేసేవారని గుర్తు చేశారు.