కాచిగూడ, మే 25: తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సరస్వత పరిషత్ సంయుక్తాధ్వర్యంలో కాచిగూడకు చెందిన పండితుడు, కవి, సాహితీవేత్త డాక్టర్ విజయభాస్కర్ హైదరాబాద్ నగర సమగ్ర సాహిత్యం, సంపాదకీయ సభ్యుడిగా నియమితులయ్యారు.
ఈ మేరకు తెలంగాణ సాహిత్య పరిషత్ కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య తెలిపారు. హైదరాబాద్పై వ్యాసాలు, వివిధ రకాల సంపాదకీయాలు రాయదలచిన వారు 9290826988 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.