Driving speed limit in Hyderabad | ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలుస్తాయని పోలీసులు అంటున్నారు. అంతేకాక అతివేగం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఓ సుదీర్ఘ అధ్యయనం చేశారు. కేవలం 22 రకాల తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. అందులో వేగం కూడ అతి ప్రధానమైందని తేల్చారు. చాలా వరకు నగరంలో ఉన్న రోడ్ల స్థితికి అనుగుణంగా ప్రయాణ సమయంలో ఏ ఒక్కరూ క్రమశిక్షణ పాటించడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను గుర్తించడం లేదు. హెల్మెట్ పెట్టుకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు 99 శాతం ప్రాణాలు నిలుస్తాయని అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై 80 శాతం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ద్విచక్ర వాహనదారులు వాహనాలను నడిపిస్తూ డేంజర్ బెల్స్ను మోగిస్తున్నాడు.
రోడ్డు నిర్మాణాల పనితీరును పరిశీలించి జీహెచ్ఎంసీ అధికారులు ప్రయాణ వేగాన్ని నిర్ధారిస్తారు. గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే నడపాల్సిన వాహనాలను అందుకు భిన్నంగా మూడింతల వేగంతో ప్రయాణిస్తున్నారు. ఇలా అతివేగంగా ప్రయాణించి గ్రేటర్ పరిధిలో 250 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 300కు పైగా మృతి చెందారని పోలీసులు నమోదు చేసిన కేసుల్లో స్పష్టమవుతున్నది.
పోలీసులు, చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు అయిష్టంగా హెల్మెట్ను ధరిస్తున్నారు. పోలీసులు దాటిన తర్వాత వెంటనే తీసేస్తున్నారు. కానీ హెల్మెట్ అనేది వారి విలువైన ప్రాణాల కోసం అన్న సంగతి మరుస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రమాదాలకు గురైన వాటిలో 90 శాతం మంది మరణించారు. దీంతోనే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే చట్టాన్ని కఠినతరం చేశారు. అంతేకాక ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధననూ పెట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్లో ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయో తెలుసా?
Babu Mohan: స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Sai Dharam Tej: తేజూకి ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్కి కాల్ చేసిందెవరో తెలుసా?
Driving speed limit in Hyderabad