Babu Mohan on Sai dharam tej accident | స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడ్డ సాయి తేజ్ ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఆయన ప్రమాదంపై సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్కు హాజరు కావాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై బాబు మోహన్ స్పందిస్తూ.. తన కొడుకు మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
యాక్సిడెంట్లో నా కొడుకు చనిపొవడం ఎప్పటికీ మరచిపోలేను అన్నారు.సాయిధరమ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ ఆ నాటి సంఘటన గుర్తుకొచ్చి ఆవేదన చెందారు బాబు మోహన్. అయి సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడొద్దని ఆయన సూచించారు.యాక్సిడెంట్ జరిగి వాళ్ళు పోతే పోయారు కానీ అతన్ని ప్రేమించిన వాళ్ళు మానసిక క్షోభ అనుభవిస్తారు. అందరూ అది ఆలోచించుకోవాలని చెప్పారు.
సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడు. కొందరు హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీలా ఫీలవుతారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయి యాక్సిడెంట్ కాగానే చతికిలపడతారు. లేకపోతే అతన్ని నమ్ముకున్న వాళ్ళు చీకట్లోకి వెళ్లిపోతారు. దానికి ఉదాహరణ నేనే. ఓ తండ్రి కొడుకును గనుక కోల్పోతే తండ్రి బాడీ కాలిపోయేవరకు ఆ దుఃఖం ఉంటుంది. కడుపుతీపితో వచ్చే ఆ దుఃఖాన్ని ఎవరూ ఆపలేరు.
దయచేసి మోటార్ బైకుల ప్రియులు మీ కుటుంబాన్ని గుర్తుచేసుకొని బైక్ నడపాలని యువతను రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ తల్లిదండ్రులను పూజించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని బాబు మోహన్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Sai Dharam Tej: తేజూకి ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్కి కాల్ చేసిందెవరో తెలుసా?
sai dharam tej accident | హైదరాబాద్లో ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయో తెలుసా?
హైదరాబాద్ సిటీలో ఎంత స్పీడ్తో వాహనాలు నడపాలో తెలుసా