మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుండి బయటపడిన విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జిపై బైక్ స్కిడ్ కావడంతో పల్టీలు కొట్టుకుంటూ వెళ్లిన సాయి ధరమ్ తేజ్ని సకాలంలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాలు నిలిచాయి. అయితే ఆ సమయంలో తేజ్ గురించి అంబులెన్స్కి సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు అబ్ధుల్. అమీర్ పేటలోని సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగ్ లో ఉద్యోగం చేస్తుంటాడు.
పని మీద నిజాం పేటకు వయా దుర్గంచెరువు కేబుల్ వంతెన.. హైటెక్ సిటీ మార్గం మీదుగా బైక్పై వెళుతున్నాడు అబ్ధుల్. ప్రమాదాన్ని చూసి వెంటనే డయల్ 100కు.. అంబులెన్సు కోసం 108కు ఫోన్ చేసి.. సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్ పది నిమిషాలలో అక్కడి చేరుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్కి ఫిట్స్ రాగా, వెంటనే స్పందించిన వైద్యులు అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో.. తదుపరి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు
గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలించటం వలన తేజూ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా సకాలంలో స్పందించారు. సమాచారం అందిన వెంటనే.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరటంలో సాయం చేశారు. అంబులెన్సులో మెడికవర్ హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పుడు మాత్రమే అతను హీరో సాయి తేజ్ అని తెలిసింది. ఏదేమైన వారు సకాలంలో స్పందించడం వలనే ఈ రోజు సాయి తేజ్ సేఫ్గా బయటపడ్డాడు.