సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాల విధులు, బాధ్యతలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతరం తనిఖీ నిర్వహణ, ఈఎస్ఎమ్ఎస్ ఆప్లికేషన్, సి-విజిల్ యాప్ తదితర అంశాలపై జిల్లా వ్యయ పరిశీలకులు శరత్చంద్ర అవగాహన కల్పించి దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా పాటించాలని, అన్ని పార్టీలు అభ్యర్థుల పట్ల నిబంధనలకు అనుగుణంగా సమదృష్టితో వ్యవహరించాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎన్నికల వ్యయం, ప్రచార సరళిపై నిఘా బృందాలు అనునిత్యం అప్రమత్తంగా ఉండి నిఘా పెట్టాలని జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు షిప్ట్లలో 24 గంటల పాటు పనిచేసే విధంగా ఆయా నిఘా బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలకు సమకూర్చిన వాహనాలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీటీజీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ప్రకాష్రెడ్డి తెలిపారు. ఆదే విధంగా జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందన్నారు. వీటి ద్వారా నిఘా బృందాల పనితీరును కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, నిబంధనలకు అనుగుణంగా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. సి-విజిల్ ద్వారా ఫిర్యాదులు అందిన 15 నిమిషాల్లో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు అక్కడికి చేరుకోవాలన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని, నగదును జప్తు చేసిన సందర్భాల్లో వీడియో కవరేజి చేయాలని ప్రకాష్రెడ్డి సూచించారు. శిక్షణ కార్యక్రమంలో ఈవీడీఎం డీఎస్పీ శ్రీనివాస్, సుదర్శన్, జిల్లా వ్యయ పరిశీలకులు నోడల్ అధికారి శరత్ చంద్ర, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు చేయాల్సిన విధులు, బాధ్యతలు, ఈఎస్ఎంఎస్ ఆప్లికేషన్, సి-విజిల్ యాప్ తదితర అంవాలపై మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పించారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిద్దాం..; అధికారులకు కలెక్టర్ సూచనలు
పార్లమెంట్ ఎ న్నికలను పారదర్శకం గా నిర్వహిస్తామని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. కలెక్టరేట్లో సోమవా రం పార్లమెంటరీ నియోజకవర్గం నోడల్ అధికారులు, ఏఆర్ఓ డిప్యూటీ కమిషనర్ల తో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని తెలిపారు. ఏప్రిల్ 25 న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కా గా, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మే 13న పోలింగ్కు అందరు అధికారులు సమయాత్తం కావాలని సూచించారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపా రు. నామినేషన్, మ్యాన్ పవర్, ట్రైనింగ్, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, టెక్నికల్, ఈవీ ఎం, ఎంసీసీ, ఎక్సెండిచర్ మేనేజ్మెంట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఏఆర్ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు,కరెంట్, టాయిలెట్స్, కుర్చీలు, టేబుల్స్, లైటింగ్, సానిటేషన్ వసతుల ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెగ్మెంట్ వారిగా నిరంతరాయంగా పోలిం గ్ కేంద్రాలను సందర్శించాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల కల్లా నివేదిక పంపాలని తెలిపారు.
మల్కాజిగిరికి ఓటింగ్ శాతం పెంచేలా..
దేశంలోనే ఓటర్ల సంఖ్యా పరంగా అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్లను ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులను చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలలో ప్రత్యేక బృందాలను నియమించారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం తగ్గిన ప్రాంతాలను గుర్తించిన బృందాలు, అక్కడ ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు ఓటు హక్కు, దాని విలువపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో 49.40 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైన క్రమంలో మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.