హయత్నగర్, మే 2 : సీఎం సహాయ నిధితో ఎంతోమంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం హయత్నగర్ డివిజన్కు చెందిన ఆండాలు కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి అందజేశారు. హయత్నగర్ డివిజన్ ముదిరాజ్ కాలనీకి చెందిన ఆండాలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరింది. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు బాగలేనందున స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.48వేలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదపడుతుందన్నారు. ఈ పథకం పేదలకు ఓవరం లాంటిందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ హయత్నగర్ డివిజన అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.