సిటీబ్యూరో, నవంబరు 15 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్లను ఎన్నికల అధికారులు బుధవారం పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 4119 పోలింగ్ కేంద్రాలు, 45 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నందున జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో బూత్ లెవల్ అధికారులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ స్లిప్లతో పాటు ఓటరు గైడ్ బుక్లెట్ ఓటింగ్ ప్రక్రియ, వినియోగంలో అర్హత గల పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు, అభ్యర్థుల వివరాల సమాచారాన్ని అందిస్తున్నారు. ఇతర వివరాలను VOTERS.CCI.GOV.IN వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఓటరు స్లిప్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.