సుల్తాన్ బజార్, జూలై 11: మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా పండుగలను గొప్పగా జరుపుకోవాలని రాష్ట్ర పశు పంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధా న కార్యాలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా నగర పరిధిలోని పలు ఆలయాలకు ఆర్థిక సాయం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఏటా ప్రభుత్వం అం దించే ఆర్ధిక సహాయం కింద గోషామహల్, మలక్పేట నియోజకవర్గాల పరిధిలోని 178 దేవాలయాలకు రూ. 59.96 లక్షల చెక్కులను ఆయన ముఖ్య అతిథిగా విచ్చే సి పంపిణీ చేశారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఉత్సవాలకు ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నదని అన్నారు. బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతో దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ దేవాలయాలతో పాటు ప్రైవేట్ దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆర్ధిక సహాయం అందించడం లేదన్నారు. ఈ యేడాది బోనాల ఉత్సవాలకు గాను ప్రభుత్వం రూ.15 కోట్లను విడుదల చేసిందన్నారు.
వారం రోజుల ముందే ఆలయాల నిర్వాహకులకు ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నెల 16వ తేదీన పాత బస్తీలో జరుగనున్న బోనాల పండుగ నేపధ్యంలో సోమవారమే ఓల్డ్ సిటీ, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేసినట్టు పేర్కొన్నారు. బోనా ల సంధర్భంగా ఆలయాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు ఆయన వివరించారు.
ఈ నెల 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే ఊరేగింపునకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో 211 దేవాలయాలకు రూ.56 లక్షల 13 వేల చెక్కులను రాష్ర్ట బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, దివంగత నేత, ఎమ్మెల్యే కుమార్తెలు లాస్య నందిత, నివేదితలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ రాజాసింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ అని ల్ కుమార్, డీసీ రామకృష్ణ, బీఆర్ఎస్ గోషామహల్ ఇన్చార్జి నంద కిశోర్ వ్యాస్, కార్పొరేటర్లు శంకర్ యాద వ్, సురేఖ, రాఖేష్ జైస్వాల్, ప్రేమ్ సింగ్ రాథోడ్, మమ తా సంతోష్ గుప్తా, పరమేశ్వరీ సింగ్ పాల్గొన్నారు.
అందరి సమష్టి కృషితోనే.. ‘ఉజ్జయినీ బోనాలు’ విజయవంతం
బేగంపేట్ జూలై 11: ప్రభుత్వ శాఖల సమన్వ యం, భక్తుల సహకారంతో ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర, ఉత్సవాలు విజయవంతం అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపా రు. జాతరకు సుమారు 30 లక్షల మంది భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మా ట్లాడారు. జాతరలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రధానంగా పోలీసులు 10 రోజులుగా నిత్యం పనిచేస్తూ జాతరలో ఇబ్బం ది కలగకుండా జాగ్రత్త తీసుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్లో విద్యుత్ షా క్కు గురై మరణించిన పాతబస్తీ యువకుడు ఠాకూర్ ఆకాశ్ సింగ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో గుత్తా మనోహార్రెడ్డి, ఏసీపీ రమేష్, సీఐ కావేటి శ్రీనివాస్, చైర్మన్ సురిటీ రామేశ్వర్, అరుణ గౌడ్ పాల్గొన్నారు.