ఉప్పల్, మార్చి 13 : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. సోమవారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారు లు వెంకటయ్యకు రూ.60 వేలు, అఖిల్కు రూ.60 వేల చెక్కులకు సంబంధించి ఎల్ఓసీ పత్రాలను ఎమ్మెల్యే వా రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజల అభ్యున్నతికి తమవంతు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అం దేలా చూస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజ ల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, బద్దం భాస్కర్రెడ్డి, గరి క సుధాకర్, నందికంటి శివ, సూరం శంకర్, శివకుమార్, జయకృష్ణ, చాంద్పాషా పాల్గొన్నారు.