మేడ్చల్జోన్బృందం29: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మం గళవారం మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదింటి బిడ్డకు పెండ్లి కానుకగా రూ. 1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వ దవాఖానాలో కేసీఆర్ కిట్ మొదలుకుని ఎంతో మంది ఆడబిడ్డలకు పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలిచారని పేర్కొన్నారు. నిరుపేదల ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, నవీన్రెడ్డి, అనంతరెడ్డి, రమ్య, శారద, మంజుల, సుభాష్నాయక్, స్వాతి, పసన్నలక్ష్మి, నాయకులు రవీందర్, చంద్రారెడ్డి, శ్రీధర్రెడ్డి, సతీశ్గౌడ్, ఈశ్వర్రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మహేశ్, జావిద్ఖాన్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులను మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కీసర మండల పరిషత్ కార్యాలయంలో మంగళవా రం 16 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అందుకే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని ఓర్వలేకనే కుట్రలు పన్నుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, తహసీల్దార్ గౌరీవత్సల, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో మంగతయారు, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్రెడ్డి, సర్పంచ్లు మాధురి వెంకటేశ్, ఆండాలుమల్లేశ్, విమలనాగరాజు, మహేందర్రెడ్డి, ధర్మేందర్, పెంటయ్య, రాజుముదిరాజ్, ఎంపీటీసీ కవితశశికాంత్, వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్,నారాయణ, ప్రవీన్కుమార్, రమేశ్యాదవ్, శ్రావణ్కుమార్,బాల్రెడ్డి, లక్ష్మారెడ్డి,అమరేందర్రెడ్డి, సుజాత, ఆరీఫ్, భాషరత్ అలీ పాల్గొన్నారు.