సెప్టెంబర్ 2న గ్రేటర్లో 12 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 బీహెచ్కే ఇండ్ల కాలనీల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు 12 ప్రాంతాలను బుధవారం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్-2, కొల్లూరు-1, రంగారెడ్డి జిల్లా మంఖల్-2, మేడ్చల్ జిల్లా అహ్మద్గూడ, డీ.పోచంపల్లి, ప్రతాప సింగారం, హైదరాబాద్ జిల్లా ఫారూఖ్నగర్, బండ్లగూడలోని సర్వే నంబరు 82, 83లలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ) : ఎంపిక చేసిన 12వేల మంది లబ్ధిదారులకు సెప్టెంబర్ 2వ తేదీన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున.. 12వేల మందిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్తో ఆన్లైన్ డ్రాలో ఎంపిక చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు 12 ప్రాంతాలను అధికారులు బుధవారం ప్రకటించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్-2, కొల్లూరు-1, రంగారెడ్డి జిల్లా మంఖల్-2, మేడ్చల్ జిల్లా అహ్మద్గూడ, డీ.పోచంపల్లి, ప్రతాప సింగారం, హైదరాబాద్ జిల్లా ఫారూఖ్నగర్, బండ్లగూడలోని సర్వే నంబరు 82, 83లలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు అనుదీప్, హరీశ్, అమోయ్కుమార్, నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పది రోజులకోసారి లబ్ధిదారుల ఎంపిక
వేలాది మంది పేదల సొంతింటి కల సెప్టెంబర్ 2వ తేదీన నెరవేరబోతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దేశంలో ఎకడాలేని విధంగా పేదలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నదని చెప్పా రు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మొదటి విడతలో 12వేల మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎంతో పారదర్శకంగా ఆన్లైన్ డ్రా పద్ధతిలో ఒకో నియోజకవర్గం పరిధిలో 500 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు.
లబ్ధిదారుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇండ్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాల్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించనున్నట్లు చెప్పారు. 8ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు ఒకొకరు ఒకో ప్రాంతంలో పాల్గొని లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారు డ్రాలో తమ పేరు రాలేదని బాధపడొద్దని, ప్రతి 10 రోజులకు ఒకసారి ఆన్లైన్ డ్రా నిర్వహించి 12వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయిస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.