విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ట్యాంకులు, సంపులలో బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచాలని అవగాహన కల్పిస్తున్నది. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నది. ముఖ్యంగా నీటి సేకరణ నుంచి ప్రజలకు నీటిని సరఫరా చేసే వరకు మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంబి స్తున్నారు. దీంతో సురక్షిత నీటి సరఫరాకు ప్రత్యేకంగా 3 మొబైల్ వాహనాలను సమకూర్చారు. నీటి నాణ్యత పరీక్షకు ప్రతి సబ్డివిజన్లో లైన్మెన్లతో పాటు నీటి శాంపిల్స్ పరీక్షలో 50 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ఈపీటీఆర్ఐ, ఐపీఎంలాంటి సంస్థలు ఎప్పటి కప్పుడు నీటి శాంపిల్స్ సేకరిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ):విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. వినియోగదారుల ఇంటి నీటి సంపు వర్షపు నీటిలో కలిసి ఉంటే.. ట్యాంకులను, సంపులను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రపర్చాలని అవగాహన కల్పిస్తున్నది. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నది. జలమండలి సరఫరా చేస్తున్న నీటితో సంపును నింపుకొని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వాడుకోవాలని సూచిస్తున్నది. ముఖ్యంగా నీటి సేకరణ నుంచి ప్రజలకు నీటిని సరఫరా చేసే వరకు మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంభిస్తున్నారు. మొదటి విడతగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (డబ్ల్యూటీపీ) వద్ద క్లోరినేషన్ ప్రక్రియ, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద క్లోరినేషన్, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేస్తున్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బస్తీల్లో క్లోరిన్ బిళ్లలు పంపిణీ
నగరంలోని బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై జలమండలి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఇందుకుగాను ప్రజలు ఇండ్లలో నిల్వ చేసుకున్న నీటి నాణ్యతపై కూడా దృష్టి సారించి, నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఈ క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేస్తుండటంతో పాటు క్లోరిన్ బిళ్లలను ఉపయోగించి నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
సురక్షిత నీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలు
వాస్తవంగా 0.5పీపీఎం కంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్టే. రిజర్వాయర్లలో నీటి నిల్వ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. నీటిలో క్లోరిన్ రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటుంది. తిరిగి మళ్లీ కలిపితేనే ఆ నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే క్లోరినేషన్కు నిర్ణీత ప్రామాణిక విధి విధానాలు ప్రకటించి నిర్వహణలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సర్వీస్ రిజర్వాయర్ల వద్ద పలుమార్లు పరీక్షలు జరిపిన తర్వాతనే వినియోగదారుడికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం సబ్డివిజన్లో లైన్మెన్లతో పాటు నీటి శాంపిల్స్ పరీక్షలో 50మంది పనిచేస్తున్నారు. కలుషిత నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సురక్షిత నీటి సరఫరాకు ప్రత్యేకంగా 3 మొబైల్ వాహనాలను సమకూర్చారు. అంతేకాకుండా ఈపీటీఆర్ఐ, ఐపీఎం లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు నీటి శాంపిల్స్ సేకరిస్తున్నారు.
కలుషిత నీటితో నష్టాలివి..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు