కరోనా బాధితులకు మూడు పూటలా అన్నప్రసాదాన్ని పంపించాలని దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం ట్రస్ట్ నిర్ణయించింది. గురువారం ట్రస్టు చైర్మన్ బచ్చు గంగాధర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బాధితులకు స్వయంగా తమ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అందిస్తారని చెప్పారు. ఆలయం నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తామని పేర్కొన్నారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం పీఆర్వో కార్యాలయం నంబర్ 040-24066566, సెల్ ఫోన్ నంబర్- 8330966566లో సంప్రదించి సమాచారం అందిస్తే వారికి శనివారం నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తామని అన్నారు. కార్యవర్గ సమావేశంలో సలహా కమిటీ చైర్మన్ గుండా మల్లయ్య, ట్రస్ట్ ఉపాధ్యక్షులు వూర నర్సింహగుప్తా, శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఈవీవీ నాగేశ్వర్రావు, సంయుక్త కార్యదర్శులు బాబురావు, పద్మాకర్ ఆత్రే, కోశాధికారి శ్యాంకుమార్తోపాటు కార్యవర్గసభ్యులు శ్యామలరావు, లక్ష్మీదుర్గ పాల్గొన్నారు.