బంజారాహిల్స్ (హైదరాబాద్ ) : తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా హైదరాబాద్ నగరం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడే స్థాయికి చేరుకుందని డీజీపీ అంజనీకుమార్ (DGP Anjani Kumar ) అన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎమ్డీసీతో పాటు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఎన్ఎమ్డీసీ హైదరాబాద్ మారథాన్-2023’ (Marathon-2023) 12వ ఎడిషన్కు సంబంధించిన కర్టెన్ రైజర్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్న తరుణంలో హైదరాబాద్ (Hyderabad) అనేక నగరాలతో పోటీ పడుతోందన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో (Capita income, ) తెలంగాణ మూడోస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో మరిన్ని ఈవెంట్స్కు అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ మారథాన్లో పోలీసుశాఖ కూడా చురుకైన పాత్రపోషిస్తుందని,ఈవెంట్కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించనున్న మారథాన్ వివరాలను రేస్ డైరెక్టర్ ప్రశాంత మోర్పారియా వెల్లడించారు. మారథాన్లో భాగంగా ఆగస్టు 26న హైటెక్స్వద్ద 5కే రన్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆగస్టు 27న ఉదయం 4.30కి పీపుల్స్ ప్లాజా వద్ద ఫుల్ మారథాన్, 5.30గంటలకు హాఫ్ మారథాన్, ఉదయం 6.30కి మాదాపూర్లోని హైటెక్స్ వద్ద 10కే రన్ప్రారంభం కానుందని తెలిపారు. ఈ మారథాన్లో దేశవిదేశాలకు చెందిన సుమారు 20వేలమంది రన్నర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.